జల వివాదం తర్వాత తొలిసారి.. పెళ్లిలో కలిసిన కేసీఆర్, జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్రెడ్డి కుమారుడైన రోహిత్రెడ్డితో స్నిగ్దారెడ్డి మూడు ముళ్లు వేయించుకుంది. ఏపీ నుంచి సీఎం జగన్తో పాటు స్పీకర్ తమ్మినేని, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తదితరులు హాజరయ్యారు. ఇక హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్తో పాటు వైఎస్ విజయలక్ష్మీ కూడా పెళ్లికి హాజరవ్వడం విశేషం. తెలంగాణ, ఏపీ సీఎంలతో పాటు గవర్నర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ఈ పెళ్లిలో సందడి చేశారు.