క‌ష్ట‌డీలోకి తీసుకుని చిత్ర హింస‌లు... కోర్టు ఆగ్ర‌హం..!

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు అయ్యింది . గుంటూరు జిల్లా కొల్లూరులో ఇద్దరు వ్యక్తులను ఇల్లీగల్ కస్టడీ లోకి తీసుకొని పోలీసులు చిత్రహింసలకు గురిచేసారంటూ పిటిషన్ దాఖలు కావడం కలకలం రేపుతోంది . షేక్ అక్తర్ రోషన్ అనే వ్యక్తి వ్యక్తిని పోలీసులు చిత్ర హింసలు పెట్టారంటూ  పిటిషన్ ను దాకలు చేసినట్టు సమాచారం . దాంతో ఇల్లీగల్ కస్టడీపై ధర్మాసనం చాలా సీరియస్ గా స్పందించింది 

ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకోని చిత్రహింసలకు గురిచేయడం ఏంటని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది . తప్పు చేస్తే శిక్షించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయని కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది . ఏడీజీ అధికారితో విచారణ జరిపించి పూర్తి సమాచారం వీలైనంత త్వరగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది రాజారెడ్డి పిటిషనర్ తరుపున వాదనలు వినిపించారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: