నన్ను ఘోరంగా ఎమ్మెల్యేలు అవమానించారు: సిఎం ఆవేదన

చర్చలు జరిగిన తీరుతో నేను అవమానానికి గురయ్యాను అని ఆవేదన వ్యక్తం చేసారు పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈరోజు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షురాలితో మాట్లాడాను అని ఆయన పేర్కొన్నారు. నేను ఈరోజు రాజీనామా చేస్తానని చెప్పాను అని ఆయన వెల్లడించారు. ఇటీవలి నెలల్లో ఎమ్మెల్యేలను కలవడం ఇది మూడోసారి అన్నారు ఆయన.  అందుకే నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను  అని స్పష్టం చేసారు.
 నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నా మద్దతుదారులతో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తాను అని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. నాకు తెలియకుండా పార్టీ ఎమ్మెల్యేల తో సమావేశం జరపడం మూడోసారి అన్నారు ఆయన. దీన్ని నేను చాలా అవమానంగా భావిస్తున్న ,అందుకే సీఎం పదవికి రాజీనామా చేశాను అన్నారు. పార్టీ పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తిని అధిష్ఠానం సీఎంని ఎంపిక చేస్తుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: