జ‌గ‌న్ ను కీర్తించిన ఆర్ ఆర్ ఆర్ !

RATNA KISHORE
ఎప్పుడూ తిట్ల దండ‌కంతో దండెత్తే ఎంపీ ఆర్ ఆర్ ఆర్ తాజాగా జ‌గ‌న్ ను శత‌ధ్రువంశ యోధుడు అని కీర్తించారు. అయితే ఇదేమీ నేరు ప్ర‌శంస కాదులేండి కాస్త వ్యంగ్య ధోర‌ణిలోనే ఆయ‌న ఏపీ సీఎంపై వ్యాఖ్య‌లు చేసి త‌న పాత కోపం అంతా ప్ర‌ద‌ర్శించారు.
సీబీఐ కోర్టులో ఇవాళ జ‌గ‌న్ బెయిల్ డిస్మిస్ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. అయితే సీబీఐ త‌ర‌ఫున న్యాయ‌వాదులు గ‌డువు కోరడంతో విచార‌ణ‌కు ఈ నెలాఖ‌రుకు వాయిదావేసింది. అనంత‌రం ఆర్ ఆర్ ఆర్ మీడియాతో మాట్లాడుతూ..  కోర్టుకు వ‌చ్చి సచ్ఛీల‌త నిరూపించుకోవాల‌ని కోరుతూ వ్యంగ్య ధోర‌ణిలో పై వ్యాఖ్య‌లు చేశారు.. అలానే జ‌గ‌న్ న్యాయ‌వాదుల‌యిన ఇద్ద‌రికి ఒకే రోజు జ్వ‌రం వ‌చ్చింద‌ని, ఇదెంతో ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌ని ఒక‌వేళ న్యాయ‌వాదులు చెప్పిన మాట‌లు నిజ‌మే అనుకుంటే ఈ ప‌రిణామాన్ని తానేమీ త‌ప్పుప‌ట్ట‌న‌ని పేర్కొంటూ  ఇంకొన్ని కీలక వ్యాఖ్య‌లు చేశారు.. జ‌గ‌న్ నిర్దోషి అని నిరూపించేందుకే త‌న ఆరాటం అని ఈ విష‌య‌మై త‌న‌ను ఎవ్వ‌రూ అర్థం చేసుకోవ‌డం లేద‌ని., క‌నీసం ముఖ్య‌మంత్రి అయినా త‌న‌ను అర్థం చేసుకోవాల‌ని కోరడం కొస‌మెరుపు.  ఓ వైపు క‌రోనా విజృంభిస్తుంటే మ‌రో వైపు పాఠ‌శాల‌ల‌ను ఆగ‌స్టు 16 నుంచి తెరుస్తామ‌ని చెప్ప‌డం సబ‌బు కాద‌ని అంటూ ఈ విష‌య‌మై రాష్ట్ర ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేయాల‌ని కోరారు. అదేవిధంగా సాయిరెడ్డిని ఉద్దేశించి మ‌రికొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.. తాను కూడా సాయి రెడ్డి మాదిరిగా లేఖ‌లు రాయ‌గ‌ల‌న‌ని, ఆయ‌న ప్రారంభించిన సూట్ కేసు కంపెనీల భాగోతం బ‌య‌ట‌పెడ‌తాన‌ని అన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: