అవును.. కావాల‌నే 'ద‌ళిత బంధు' ప్ర‌క‌టించాను!!

Garikapati Rajesh

తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్య‌మ స‌మ‌యంలో కొంద‌రు త‌న శ‌రీర భాగాల గురించి ఎగ‌తాళి చేశార‌ని, వాట‌న్నింటినీ ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్ల‌డంవ‌ల్లే ఈరోజు ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించుకోగ‌లిగామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్ర‌పంచంలో త‌న‌ను తిట్టిన‌న్ని తిట్లు ఎవ‌రినీ ఎవ‌రూ తిట్టిఉండ‌రేమోన‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ ఎస్‌లో చేరుతున్న సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కేసీఆర్ మాట్లాడారు. అస‌లు త‌న ముక్కుతో విమ‌ర్శించేవారికి ఏం ప‌న‌ని ప్ర‌శ్నించారు. హుజూరాబాద్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకునే ద‌ళిత బంధు పైలెట్ ప్రాజెక్టు పెట్టారంటున్నార‌ని, గెల‌వ‌డం కోస‌మే పెట్టాన‌న్నారు. వంద‌కు వంద శాతం అది నిజ‌మ‌ని, గెల‌వాలంటే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. అధికారంలో లేనివారే అనేక హామీలిస్తున్నార‌ని, అధికారంలో ఉండి గెల‌వాలి  కాబ‌ట్టి ద‌ళిత బంధు పెట్టామ‌న్నారు. హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో గెలిచేపార్టీ త‌మ‌దేన‌ని కేసీఆర్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag

సంబంధిత వార్తలు: