ప్రస్తుతం నకీలీ విత్తనాలు రైతులను ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా నకిలీ విత్తనాలు అమ్మేవారికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మినా లేదంటే సరఫరా చేసినా అలాంటి వారి సమాచారాన్ని డయల్100 లేదా సైబరాబాద్ వాట్సాప్ -9490617444 ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపారు. అంతే కాకుండా శంషాబాద్ జోన్ పరిధిలో తాజాగా నకిలీ విత్తనాలు అమ్ముతున్న 8 మంది నింధితులను అరెస్ట్ చేశారు. వారి వద్దనుండి 5 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.