ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.నేరడిగొండ మండలం రోల్మామడ వద్ద రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ప్రమాదంలో రెండు లారీల్లోని డ్రైవర్లు అక్కడిక్కక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్యాబిన్లో డ్రైవర్ల మృతదేహాలను బయటికి తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.