బ్లాక్ ఫంగస్ సోకినవారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు త్వరలోనే దీనికి సంబంధించి ఓ జీవో జారీ చేస్తామని ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ను మొదట్లోనే గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చని .. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతామని వివరించారు.