కరోనా రోజు రోజుకి తీవ్ర ఉగ్రరూపం దాల్చుతుంది. దీంతో కరోనా బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నేతలు ఈ మహమ్మారి బారిన పడ్డి.. చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కోవా లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు.ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని ఆయన సూచించారు.