దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య చాలా రోజుల తర్వాత మూడు లక్షల కన్నా తక్కువగా నమోదైంది. వరుసగా నాలుగో రోజు 3 లక్షలలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 2,81,386 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉదయం విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,81,386 మంది వైరస్ బారినపడ్డారు. 3,78,741 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 4,106 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 2,49,65,463కు పెరిగాయి. 2,11,74,076 మంది కోలుకున్నారు. ఇంకా 35 లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 2.74 లక్షల మందికిపైగా మృతి చెందారు.