ఆమెది హత్యా.. ఆత్మహత్యా..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరూ దంపతులు కేఆర్ పురంలో జీవనం సాగిస్తున్నారు. జ్యోతి గాయనిగా పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గోని మంచి పేరు సంపాదించింది. ఇక ఇటీవల కోలారుకు వెళ్లిన జ్యోతి అక్కడే బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. అయితే జ్యోతికి ఇటీవల కరోనా సోకిందని ఆ భయంతోనే ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గదిలో అపాస్మరక స్ధితిలో పడి ఉన్న జ్యోతిని వెంటనే కోలార్లోని స్థానిక ఆసుపత్రిలో చేరారు. అప్పటికే ఆమె ప్రాణం విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. జ్యోతి మృతికి కుటుంబ కలహాలకు కారణమని అనుమానలు కూడా తతెత్తున్నాయి.