అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. "నర్సుల సేవలు, త్యాగం మరువలేనివి. ఎంతో సహనంతో రోగులను తల్లిలా చూసుకుంటారని సీఎం కొనియాడారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని సీఎం అన్నారు.