ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం కోవిడ్ టీకా తీసుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 45 - 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి టీకా వేస్తున్నారు. ఈ టీకా ప్రక్రియలో 60 ఏళ్లు పై బడిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్ల ఉండి ధీర్ఘకాల వ్యాధులతో బాధపడుతోన్న వారికి కూడా టీకా వేస్తున్నారు. తాను తొలి డోస్ టీకా తీసుకుంటోన్నట్టు సోషల్ మీడియా వేదికగా చెప్పిన మోడీ టీకా కోసం మన దేశ శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇక మోడీ భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: