వివాహేతర సంబంధమే అతని పాలిట యమపాశమై..!

N.ANJI
నిజామాబాద్ నగరంలో వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. నాగారం ప్రాంతంలో నివాసం ఉంటున్న సాల్మన్ రాజు అనే వ్యక్తి గత ఏడాది కాలంగా ఆర్యనగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ప్లంబర్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ పనులకై వచ్చీపోయే క్రమంలో అపార్ట్‌మెంట్‌ పక్కనే నివాసం ఉండే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. నిత్యం మాట్లాడుకుంటూ ఉండడం వల్ల వారిరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అదికాస్త వివాహేతర సంబంధంగా  మారింది.
అయితే శనివారం అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన ఆ మహిళ భర్త ఉమాకాంత్ వీళ్లిద్దరూ కలిసి ఉండడం చూసి కోపంతో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న రాడ్‌తో సల్మాన్ రాజ్ తలపై కొట్టాడు. దానితో అతడు అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. అది గమనించిన ఉమాకాంత్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: