అధికారులనే పట్టిపీడిస్తుంటే.. సామాన్య ప్రజల పరిస్థితేంటి.. ఇప్పుడు మరో ఇద్దరికీ..?

praveen

రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు ఎంతో మంది ప్రజలు కరోనా  వైరస్ బారినపడి ప్రాణాలు వదలడమే  కాదు... అధికారులు  సైతం ఈ మహమ్మారి వైరస్ భారిన పడి ఆస్పత్రి పాలు అవుతున్నారు . ప్రస్తుతం సామాన్య ప్రజలతో పాటు ఎంతో మంది అధికారులు నాయకులు కూడా కరోనా వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ వైరస్ మాత్రం సోకుతుండటం మరింత ఆందోళనకరంగా మారిపోయింది. 

 

 తాజాగా వరంగల్ మేయర్ దంపతులకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావడం సంచలనం గా మారిపోయింది. వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ సహా ఆయన భార్యకు   కరోనా  లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు... కరోనా  పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది . అయితే మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్ రావడంతో స్థానిక ప్రజలందరిలో తీవ్ర భయాందోళన నెలకొంది.మేయర్ తో సన్నిహితంగా  ఉన్న వాళ్లందరు  కూడా ఆందోళన చెందుతున్నారు. మేయర్  దంపతులకు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు కూడా ఒకసారిగా  అప్రమత్తమయ్యారు. మేయర్ గన్ మెన్ సహా  ఇతర సిబ్బందిని  హోమ్ క్వారంటైన్ విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: