రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి.. ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు..?

praveen

జగన్మోహన్ రెడ్డి  సర్కార్ పై  టిడిపి అధినేత ప్రతిపక్షనేత అయిన చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన చంద్రబాబు నాయుడు.. విమర్శలతో జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. కరోనా  అనుమానిత లక్షణాలు ఉన్న వారందరిని గొర్రెల మంద లాగా ఒకే ఆంబులెన్స్ లో ఎక్కించడం దారుణం అంటూ వ్యాఖ్యానించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఇలా ఒకే ఆంబులెన్స్ లో ఎక్కువ మొత్తంలో అనుమానితులను తరలించడం వల్ల... వైరస్ లేని వారికి కూడా సోకే ప్రమాదం ఉంది అంటూ తెలిపారు. 

 

 రాష్ట్రంలో 108 వాహనాలను ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కార్.. 108 పబ్లిసిటీ కోసమే చేస్తున్నారా... లేక ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కేసులు సరిపోవని మరిన్ని కేసులు పెంచేందుకు చేస్తున్నారా  అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలి అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు చంద్రబాబు నాయుడు, అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో  భారీగా కరోనా  అనుమానితులను తీసుకెళ్తున్న ఒక వీడియో ని కూడా పోస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: