ఎందుకు చంద్రబాబు తిట్టించుకుంటావ్ ?
ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం రాజుల వ్యవహారాల పై ఇప్పుడు ఏదోక రూపంలో వివాదం తలెత్తుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వ్యవహారాలను కూడా విపక్షాలు ప్రస్తావించి విమర్శలు చేస్తున్నాయి.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో విమర్శలు చేసారు. విజయనగరం గజపతుల కుటుంబ వ్యవహారాలు ట్రస్ట్ లో జగన్ గారి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. ఇన్నాళ్లు జోక్యం చేసుకుని దోచేసింది నువ్వే చంద్రబాబు నాయుడు.. సంబంధంలేని విషయాల్లో కాలు , వేలు పెట్టి ఎందుకు తిట్టించుకుంటావ్? సంచయిత గజపతుల కుటుంభ సభ్యురాలు కాదా ? లేక మహిళలంటే నీకు చిన్న చూపా? అని ఆయన చంద్రబాబుపై విమర్శలు చేసారు.
విజయనగరం గజపతుల కుటుంబ వ్యవహారాలు ట్రస్ట్ లో జగన్ గారి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. ఇన్నాళ్లు జోక్యం చేసుకుని దోచేసింది నువ్వే CBN. సంబంధంలేని విషయాల్లో కాలు , వేలు పెట్టి ఎందుకు తిట్టించుకుంటావ్?
సంచయిత గజపతుల కుటుంభ సభ్యురాలు కాదా ? లేక మహిళలంటే నీకు చిన్న చూపా? — Vijayasai reddy v (@VSReddy_MP) July 15, 2020