ప‌ల్లెపోరు: సిటీ ఓట‌రు మించిన పల్లెటూరోడు... జ‌గ‌న్‌పై ఉప్పొంగిన అభిమాన‌మేనా ?

murali krishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు పోలింగ్ ఎంతో జోరుగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజలు ఈ సారి ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.రాష్ట్రం బాగుపడాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఓటరు గ్రహించాడు..తాను ఎంత దూరంలో వున్నా కూడా ఎలాగైనా ఓటు వేయాలనే సంకల్పంతో ఓటరు కదిలి వస్తున్నారు.. అయితే ఈ సారి సిటీ ఓటర్ల కంటే పల్లె ఓటర్లు ఘననీయంగా పెరిగారు. అయితే దీనికి కారణం కూడా కూడా ఉంది. రాష్ట్రంలో వైసీపీ గత ఐదేళ్ల పాలన ఎంతో అద్భుతంగా సాగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం 100 శాతం నేరవేర్చింది.ప్రతి పేదవాడికి మంచి జరిగేలా ఈ ప్రభుత్వం చూసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించారు.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పల్లెటూరులో మరియు పట్నంలో పేద ప్రజల ఇంటికే నేరుగా పధకాలను చేరవేసి పేదల మనసులో జగన్ చిరస్థాయిలో నిలిచారు. 


ప్రతి గ్రామానికి రైతు భరోసా, ఫ్యామిలీ డాక్టర్ వంటి పధకాలతో ప్రజలకు వైద్య సదుపాయాలు అందించారు.. అమ్మఒడి, విద్యా దీవెన వంటి పధకాలతో పేద పిల్లలనూ చదువుకు దూరం కాకుండా చేసారు.. పేద పిల్లలో చదివే సమయంలో ఆకలితో ఉండకూడదని జగన్ గోరుముద్ద పధకం తో పేద పిల్లల కడుపు నింపారు.. అలాగే ప్రయివేట్ స్కూల్ కు ధీటుగా గవర్నమెంట్ రూపురేఖలు మార్చేశాడు.. అలాగే ఎన్నో మెడికల్ కాలేజెస్, ఎన్నో పోర్ట్స్ నిర్మించి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిపదం లోకి తీసుకువచ్చారు..అలాగే ఇల్లు లేని పేదలకు ఇల్ల పట్టాలను అందించి వారికీ మంచి సదుపాయం కల్పించారు..ఇన్ని మంచి పనులు చేసిన వ్యక్తిని దూషించిన కూటమి అభ్యర్థులను ఓడించడానికి పల్లె ప్రజలు జోరుగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. జగన్ పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయి.. దీనితో ఈ సారి కూడా జగన్ ను ఓటు వేయడానికి పల్లె ప్రజలు పోలింగ్ కేంద్రాలలో బారులు తీరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: