ఏపీలో భయపెడుతున్న మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో  గత 24 గంటల్లో 1813 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1775, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34 మందికి కరోనా సోకింది.  గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజు రోజుకి కరోనా మరణాలు పెరుగుతున్నాయి.  ఒక్కో జిల్లాల్లో ముగ్గురు నలుగురు ప్రతీ రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. 

 

ప్రతీ రోజు 13 మంది పైగానే ప్రాణాలు కోల్పోతున్నారు. ఏపీలో మరణాలే భయపెడుతున్నాయి. కేసులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నా సరే ఈ స్థాయిలో మరణాలు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. తెలంగాణా తో పోలిస్తే ఏపీలో మరణాలు చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీనిపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: