కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్
చెన్నైలోని పుదుచ్చేరికి బాగుర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనవేలు పై స్పీకర్ వీపీ శివకులుందు అనర్హత వేటు వేశారు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బాగుర్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయ్యిందని ప్రకటించారు స్పీకర్.
అయితే ఈ ఫిర్యాదు ఎప్పటినుంచొ ఉందని దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే ధనవేలు కోరినప్పటికీ తగిన సమాధానం రాకపోవడంతో ప్రస్తుతం రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాల మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనవేలు పై అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ శివకులుందు తెలిపారు.