రాధే శ్యాం, రొమాంటిక్ లుక్ తో ప్రభాస్ పూజ కాంబో అదుర్స్...!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లు గా వస్తున్న చిత్రం రాధే శ్యాం. సాహో సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది.
సోషల్ మీడియాలో విడుదల చేయగా ఇందులో పూజ హెగ్డే ప్రభాస్ కలిసి కనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ ని చూపించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇటీవల ప్రభాస్ 10 వ తేదీ 10 గంటల పది నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
#Prabhas20FirstLook 😍😍😍😍#Prabhas - @hegdepooja's periodical love story titled as #RadheShyam - FL Looks like TFI's Masterpiece love story on cards.#Prabhas20 #Prabhas #RadheShyamFirstLook #PoojaHegde @UV_Creations pic.twitter.com/0CHOZs01uv — Kollywood Cinema (@KollywoodCinima) July 10, 2020