బ్రేకింగ్ : ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులపై రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం..
ప్రైవేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజులపై తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేంతవరకు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ ఊరట లభించినట్లయింది.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ స్కూళ్లు తెరుచుకునేంత వరకు ప్రభుత్వ ఆదేశాలు అమల్లో ఉంటాయని రాజస్థాన్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.