తెలుగు మీడియాను భయపెడుతున్న కరోనా

ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. ఇక తెలంగాణా రాజధాని హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని గా ఉన్న విజయవాడ లో కరోనా కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. 

 

ఇప్పుడు ఇది పక్కన పెడితే ఇటీవల హైదరాబాద్ లో షేక్ పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సమయంలో అక్కడికి మీడియా ప్రతినిధులు భారీగా  వెళ్ళారు. దాదాపు అన్ని చానల్స్ వాళ్ళు వెళ్ళారు. ఇక అదే విధంగా బంజారా హిల్స్ ఎస్సై రవీంద్ర నాయక్ ని కూడా అదుపులోకి తీసుకోవడంతో స్టేషన్ కి వెళ్ళారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో 15 మందికి కరోనా రావడంతో ఇప్పుడు మీడియా భయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: