తన వంతు కూడా వస్తుంది అని చంద్రబాబు భయం...!

తమ ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేస్తుంది అని ఏపీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జేసి ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలకు ఎందుకు ఆందోళన అని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారు ఎవరు అయినా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరు అని ఆయన స్పష్టం చేసారు. సామాన్యులకు ఒక రూల్ టీడీపీ నేతలకు ఒక రూల్ ఉండదు అంటూ ఆయన  పేర్కొన్నారు. 

 

తన వంతు తన కుమారుడి వంతు కూడా వస్తుంది అని చంద్రబాబు భయపడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు హయంలో ఎన్నో అక్రమాలు జరిగాయి అని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. తమ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: