బ్రేకింగ్ : నా త‌ల్లికి క‌రోనా.. స‌హాయం చేయండంటూ నటి అభ్యర్థన...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాలలో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ సామాన్యులతో పాటు ప్రముఖులకు కూడా సోకుతోంది. సినీ, రాజకీయ, క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులు కరోనా భారీన పడుతున్నారు. తాజాగా న‌టి దీపికా సింగ్ క‌రోనా సోకిన త‌న త‌ల్లిని ఆసుప‌త్రిలో చేర్పించ‌డానికి స‌హాయం చేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని అభ్యర్థించారు. మెడిక‌ల్ సిబ్బంది దీనికి సంబంధించిన‌ రిపోర్టులు ఇవ్వలేదని అందువల్ల తనకు ఆస్పత్రిలో చేర్పించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. 
 
ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీల‌ను ట్యాగ్ చేస్తూ తమకు వెంటనే సహాయం చేయాలని దీపికా సింగ్ అభ్యర్థించారు. ఢిల్లీలోని హార్డింగ్ మెడిక‌ల్ కాలేజీలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా త‌న త‌ల్లికి క‌రోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని... సెల‌బ్రిటీల ప‌రిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య క‌రోనా రోగుల‌కు ఎలా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారో అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మిగ‌తా కుటుంబ‌ స‌భ్యుల‌కి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వానికి విఙ్ఞ‌ప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: