భారత్ లో పెరగుతున్న కరోనా.. 24 గంటల్లో 4,987 మందికి వైరస్ నిర్ధారణ!
దేశంలో ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ మొదలైంది. కేరళాలో మొదలైన ఈ కరోనా వైరస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రబలిపోయింది. ఎంతో మంది ఈ కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కరోనాని అరికట్టడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 4,987 మందికి కొత్తగా కరోనా సోకింది.
ఇప్పటివరకు దేశంలో ఒక్క రోజులో నమోదయిన కేసుల్లో ఇదే గరిష్ఠం. రికవరీ రేటు 37.51గా ఉన్నది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు దేశంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి.