ఈ భామ ఆవ‌కాయ ప‌చ్చ‌డి ఎలా చేసిందో చూడండి..!

Kaumudhi

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య కొణిదెల నిహారిక సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే.. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న‌ లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు టైం పాస్‌కోసం ప‌లు ఛాలెంజ్‌లు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తోంది. అంతేగాదు.. ఇంటి ప‌నుల్లోనూ ఎంతో సాయ‌ప‌డుతూ ఉంటుంద‌ట‌. తాజాగా ఆవ‌కాయ ప‌చ్చ‌డి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

 

* ప్రసిద్ధ ఆవకాయ పచ్చడిని మొదటి సంవత్సరం తయారు చేశాను. కొంత ముద్ద పప్పుతో సిద్ధంగా ఉండండి*  అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోతో నోరూరించింది ఈ భామ‌‌. అయితే.. ఈ ఎందుకు చెప్పిందో తెలుసా..? గ‌తంలో నిహారిక‌ ముద్ద‌ప‌ప్పు ఆవకాయ అనే వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాలో న‌టిస్తున్న నిహారిక..త‌మిళంలో  యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఓ చిత్రం చేయ‌నుంది. ఇక ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అంద‌రూ లైక్ చేస్తూ.. కామెంట్స్ ఇస్తున్నారు. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
First year of making the famous AVAKAI PACCHADI! (mango pickle) Get ready with some muddapappu!

A post shared by {{RelevantDataTitle}}