జిడ్డుముఖం సమస్యకు ఖచ్చితంగా ఇలా చెయ్యండి..

Purushottham Vinay
ఇక వానా కాలం రాగానే వాతావరణంలో ఒక్కసారిగా అనేక రకాల మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అందువల్ల ఈ క్రమంలో ఎన్నో వ్యాధులు చుట్టుముడతాయి.ఇక ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాగానే జ్వరం, దగ్గు ఇంకా జలుబు వంటి అంటు వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతాయి. వీటితో పాటుగా అనేక రకాల చర్మ సమస్యలు ఇంకా జుట్టు రాలడం వంటివి మనల్ని చాలా ఎక్కువగా వేధిస్తుంటాయి.అందుకే ఈ వానాకాలంలో చర్మంపై వున్న జిడ్డును వదిలించుకోవటం చాలా ముఖ్యం. సహజంగా, చనిపోయిన చర్మ కణాలు అలాగే నిలిచి ఉండటం వల్ల ముఖం పై ఈ జిడ్డు అనేది ఏర్పడుతుంది. ఎవర్ యూత్ ఎక్స్‌ఫోలియేటింగ్ వాల్‌నట్ స్క్రబ్ జిడ్డు సమస్యకి చక్కటి పరిష్కారం చూపిస్తుంది. దీన్ని వర్షాకాలంలో స్టార్టర్ ఫేస్ ప్యాక్లా అప్లై చేసుకుంటే చాలా మంచిది.అందువల్ల మీ చర్మంపై జిడ్డు, మొటిమలను చాలా ఈజీగా పోగొట్టవచ్చు.ఇక మన చుట్టూ ఉండే అపరిశుభ్రత వల్ల కూడా సూక్ష్మక్రిములు మన శరీరంలోకి చేరతాయి. దీని వల్ల అనేక రకాల చర్మ సమస్యలు అనేవి వస్తుంటాయి.

 ఇక ఈ సమస్యకి చెక్ పెట్టేందుకు రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీటితో ముఖాన్ని చాలా శుభ్రంగా కడగాలి. దానివల్ల మీ ముఖం ఎంతో కాంతివంతం అవుతుంది. అలాగే మీ ముఖంపై ఏమైనా సూక్ష్మ క్రిములు ఉంటే అవి వెంటనే చనిపోతాయి. ఇక అంతేకాదు, దుమ్ము, ధూళి కణాలను ఇది చాలా త్వరగా తొలగిస్తుంది. ఆపై మీ చర్మం చాలా మృదువుగా తయారవుతుంది. గోరువెచ్చని నీటితో పాటు న్యూట్రోజెనా డీప్ క్లీన్ ఫేషియల్ కూడా మీ చర్మానికి మంచి ఫలితాలనిస్తుంది.ఇక వానా కాలంలో మీ చర్మాన్ని పూర్తిగా రక్షించుకునేందుకు- ఫేస్ మాస్క్‌అనేది చాలా బాగా పనిచేస్తుంది.ఈ కరోనా మహమ్మారి పుణ్యామాని అందరం కూడా చక్కగా ఫేస్ మాస్క్లు ధరిస్తున్నాం. ఇవి కరోనాకే కాదు అనేక రకాల చర్మ సమస్యలకు కూడా చక్కగా చెక్ పెడతాయి. ఇక మీ మొఖంపై సూక్ష్మ క్రిములు చేరకుండా ఆ మాస్కులు అనేవి అడ్డుపడతాయి. అయితే, మార్కెట్లో దొరికే నాసీరకం మాస్క్లను వాడకుండా హైడ్రా న్యూరిష్ మాస్క్ వాడటం చాలా మంచిది. ఎందుకంటే, దీన్ని సహజమైన రోజ్ వాటర్ తో తయారు చేస్తారు. అందువల్ల ఇది అనేక చర్మ సమస్యలను పోగొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: