మీ ఫేస్ మెరిసిపోవాలంటే మార్నింగ్ ఇలా చెయ్యండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే రోజు ఉదయం ఈ పద్ధతులు పాటించండి. రోజు ఉదయాన్నే కాస్తంత రోజ్ వాటర్ ను తీసుకోండి. అందులో, కొంత అలోవెరా జెల్ ను కలపండి. సింపుల్ టోనర్ రెడీ అవుతుంది. మొదట, అలోవెరా లీఫ్ ను తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసి అందులోంచి జెల్ ను తీయండి. ఒకవేళ అలోవెరా ప్లాంట్ లేకపోతే మార్కెట్ లో లభ్యమయ్యే అలోవెరా జెల్స్ ను వాడినా మంచిదే.
ఆ తరువాత, రోజాపువ్వు నుంచి కొన్ని రోజ్ పెటల్స్ ను తీసుకోండి. శుభ్రంగా కడగండి. జెల్ ను అలాగే ఈ రోజా పెటల్స్ ను బ్లెండర్ లో వేయండి. ఈ రెండూ లిక్విడ్ వంటి పేస్ట్ లా తయారవ్వాలి. మొత్తానికి టోనర్ పూర్తిగా సిద్ధమైంది. దీన్ని జార్ లో గాని లేదా శుభ్రమైన బాటిల్ లో గానీ భద్రపరచండి.దీన్ని ఫ్రిడ్జ్ లో భద్రపరిస్తే దాదాపు 5 నుండి 7 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఒకవేళ టోనర్ షెల్ఫ్ లైఫ్ ను పెంచాలనుకుంటే కొంత విటమిన్ ఈ ఆయిల్ ను కూడా ఈ మిశ్రమానికి కలపాలి. విటమిన్ ఈ క్యాప్సూల్ ను కలిపితే ఇంకా మంచిది.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: