హవ్వ.. బండి సంజయ్ ఫోటోకు దండలు?
కరీంనగర్ ప్రజలు పిచ్చోడిని గెలిపించారని కేటీఆర్ దొర అహంకారంతో మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి మండిపడ్డారు. కేటీఆర్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రాణి రుద్రమదేవి డిమాండ్ చేశారు. కేటీఆర్ ప్రొఫైల్ భారాస పేరుతో ఉన్న ఫేస్బుక్ అకౌంట్లో బండి సంజయ్ ఫోటో పెట్టి ఇక సెలవంటూ పోస్టు పెట్టారని రాణి రుద్రమదేవి విమర్శించారు. బండి సంజయ్ చనిపోయారని తప్పుడు పోస్టులు పెట్టారని.. ఈ విషయంలో కేటీఆర్కు సంబంధం లేకపోతే పోస్టు పెట్టిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదని రాణి రుద్రమదేవి ప్రశ్నించారు.