తెలంగాణ అధికారుల భూదందాలపై వైసీపీ ఎంపీ షాక్‌?

Chakravarthi Kalyan
తెలంగాణలో కొంతమంది ఐఏఎస్ అధికారులు భూదందాలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య  ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతూ స్వయాన ముఖ్యమంత్రి బయటపెట్టారని... వీరిపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆర్ కృష్ణయ్య  తెలిపారు. వీరి ఆస్తులను స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచిపెట్టాలని ఆర్ కృష్ణయ్య  డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగాన్ని, ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తోందని... రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. 

కస్తూర్భా గాంధీ పాఠశాలలో టీచర్లతో విద్యాశాఖ అధికారులు వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఎంపీ ఆర్ కృష్ణయ్య  మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వీరికి జీతాలు చెల్లిస్తున్నారని... కానీ ఆ నిధులను కొంత మంది అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని ఎంపీ ఆర్ కృష్ణయ్య  విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు వీరిని కాంట్రాక్టు ఉద్యోగుల పరిగణించి... వీరి పోస్టులను రెన్యూవల్ చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య  డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: