టీడీపీ నేతల్లో 'స్కిల్‌' స్కామ్‌ అరెస్టుల భయం?

Chakravarthi Kalyan
టీడీపీ నేతల్లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్  స్కామ్‌ అంశంపై అరెస్టులు జరగొచ్చన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. అయితే.. ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే 2,11,984 మంది శిక్షణ ఎలా తీసుకున్నారో...,64 వేలమంది యువతకు ఉపాధి ఎలా లభించిందో జగన్ చెప్పాలని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో 330కోట్ల అవినీతి జరిగితే, శిక్షణా కేంద్రాలు నెలకొల్పిన 40 కళాశాలల యాజమాన్యాలు, పరికరాలు, వస్తువుల వివరాలతో కూడిన లేఖలు ఎందుకు ఇచ్చాయని కొమ్మారెడ్డి పట్టాభిరామ్  ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా తమ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రానికి అన్నిరకాల వస్తువులు, పరికరాలు అందినట్టు కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ఇచ్చిన లేఖపై జగన్ ఏం సమాధానం చెబుతాడని కొమ్మారెడ్డి పట్టాభిరామ్  నిలదీశారు. జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసినా కూడా చంద్రబాబు, అయన కుటుంబానికి రవ్వంత అవినీతిని కూడా అంటించలేరని కొమ్మారెడ్డి పట్టాభిరామ్  స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: