పోతూ పోతూ.. సోము వీర్రాజుకు సెగ పెట్టిన కన్నా?

Chakravarthi Kalyan
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ నిన్న రాజీనామా చేశారు. అయితే ఆయన పోతూ పోతూ సోము వీర్రాజు కారణంగానే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అది ఇప్పుడు సోము వీర్రాజుకు ఇబ్బందిగా మారింది. అయితే.. కన్నా ఆరోపణలను పెద్దగా నమ్మట్లేదని ఎంపి జీవీఎల్‌ అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ భాజపాకి రాజీనామా చేసినట్లు ప్రకటించారని.. దీని పై మా పార్టీ నాయకులతో నేను మాట్లాడానని.. కన్నా కు భాజపాలో సముచిత గౌరవం ఇచ్చారని.. ఎంపి జీవీఎల్‌ అన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గంలో‌ చోటు కల్పించారని.. ఈ రెండు ఎంతో కీలకమైన పదవులని.. కన్నా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమేనని.. గతంలో సోమువీర్రాజు పై అనేక వ్యాఖ్యలు చేశారని.. పార్టీలో సోము ‌వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి‌ చెప్పే చేశారని ఎంపి జీవీఎల్‌ అన్నారు. సోము ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. నా పై కూడా గతంలో, ఇప్పుడు కన్నా విమర్శలు చేశారని.. నా పరిధిలో నేను పని‌ చేస్తున్నానని.. కన్నా విమర్శలు పై నేను మాట్లాడనని ఎంపి జీవీఎల్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: