ఇవాళ సొంత జిల్లావాసుల కల నెరవేర్చనున్న జగన్‌..?

Chakravarthi Kalyan
వైఎస్ఆర్ జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు. జమ్మలమడుగు, పులివెందులలో సీఎం జగన్ పర్యటన ఉంటుంది. ఈ ఉదయం జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేస్తారు. JSW స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేయనున్నారు. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోనే బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు.

2019 డిసెంబర్ 23న ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్.. ఇటీవల జిందాల్ స్టీల్ తో ఒప్పందం తర్వాత ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సున్నపురాళ్లపల్లె నుంచి హెలికాప్టర్లో పులివెందుల వెళ్ళనున్న సీఎం జగన్.. పులివెందులలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి గన్నవరం బయలుదేరి వెళ్తారు. అయితే గతంలో వైఎస్‌ ఆర్‌ హయాంలోనూ బ్రహ్మణి స్టీల్‌ అంటూ హడావిడి జరిగింది. ఆ తర్వాత ఆగిపోయింది. ఈసారైనా కడప ప్రజలకు స్టీల్ ఫ్యాక్టరీ కల సాకారం అవుతుందా.. కాలమే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: