కేసీఆర్, కేటీఆర్తో జగ్గారెడ్డి భేటీ.. మతలబు ఏంటి?
మెట్రో రైలు సంగారెడ్డి జిల్లా సదాశివపేట వరకు విస్తరించాలని, దళిత బంధు తమ నియోజకవర్గంలోని దళితులకు ఇవ్వాలని.. కోరాడట. వెంటనే సీఎం కేసీఆర్ అక్కడ అందుబాటులో ఉన్న అధికారులను పిలిచి జగ్గారెడ్డి ఇచ్చిన వినతి పత్రంలోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారట. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను , మంత్రి కేటీఆర్ లను కలవడం లో తప్పేముందంటున్నారు జగ్గారెడ్డి. ఎంపీలు ప్రధానమంత్రి మోదీని కలిసినప్పుడు లేని తప్పు తాను నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ ను కలిస్తే తప్పు ఎలా అవుతుందంటున్నారు.