బాలకృష్ణ పిలిచినా వెళ్లను.. తేల్చి చెప్పిన రోజా?
పర్యాటకంగా ఏపీని అభివృద్ది చేస్తున్నామన్న రోజా భవానీ ద్వీపంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. భవానీ ద్వీపంలో కళకారులతో కలిసి మంత్రి రోజా కోలాటం చేశారు. 2023 నూతన సంవత్సర వేడుకలను కూడా మెదటి సారి భవానీ ద్వీపంలో చేశామన్న రోజా.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ వారాహితో వచ్చినా, నారా లోకేష్ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రోజా అన్నారు. పాదయాత్రలు చేస్తే బరువు తగ్గుతారు కానీ ప్రయోజనం ఉండదని రోజా సెటైర్ వేశారు.