బిగ్‌షాక్‌: కేసీఆర్‌ మెడకు చుట్టుకోనున్న కాంగ్రెస్‌ కేసు?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి మారిన12 మంది ఎమ్మెల్యే లపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సీఎల్పీ లో భేటి కానున్న టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత సిఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కాంగ్రెస్ ముఖ్య నాయకుల బృందం ఫిర్యాదు చేయనున్నారు.

12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి కాంగ్రెస్ సవివరంగా ఫిర్యాదు చేయనుంది. నలుగురు ఎమ్మెల్యే ల కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడం సంచలనంగా మారింది. మరి ఇది ఏ మలుపులకు దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: