ఈ సభకు హాజరుకాకపోతే.. రాయలసీమ ద్రోహులే?
రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నుంచి లేఖ రాసినా ఇంతవరకు సానుకూల స్పందన రాలేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని టీజీ వెంకటేష్ విమర్శించారు. ప్రాజెక్టుకు ఎందుకు కొట్టుకుపోయిందని.. ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలకు బదులే లేదని టీజీ వెంకటేష్ అన్నారు. కొత్త ప్రాజెక్టు లు కూడా మొదలు పెట్టడం లేదని... బుండేల్ , సిద్దేశ్వరం, సరస్వతి, అన్నమయ్య హంద్రీనీవా ప్రాజెక్టు లు గురించి పట్టించుకోవడం లేదని టీజీ వెంకటేష్ ఆరోపించారు.