రేపు శ్రీకాకుళం జిల్లాకు జగన్.. ఎందుకంటే..?
23వ తేదీ ఉదయం 8.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. 11 గంటలకు సీఎం వైఎస్ జగన్ నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం 11.00 – 12.55 వరకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ పత్రాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.