రేపు శ్రీకాకుళం జిల్లాకు జగన్.. ఎందుకంటే..?

Chakravarthi Kalyan
సీఎం జగన్ ఇటీవల వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. నిన్ననే ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఇక ఇప్పుడు ఆయన రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప‌ర్యటించ‌నున్నారు. అక్కడ వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష (రీ సర్వే) రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు.

23వ తేదీ ఉదయం 8.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు.  11 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌  నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం 11.00 – 12.55 వరకు సీఎం వైఎస్‌ జగన్‌  బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారులకు సీఎం వైఎస్‌ జగన్‌ పత్రాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: