తెలంగాణను టార్గెట్ చేసుకున్న కేంద్ర మంత్రులు?

Chakravarthi Kalyan
తెలంగాణకు మరో కేంద్ర మంత్రి రాబోతున్నారు. తెలంగాణను బీజేపీ టార్గెట్‌గా చేసుకున్న తర్వాత ఇలా కేంద్ర మంత్రుల రాక పెరిగింది. తాజాగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహేంద్ర నాథ్ పాండే, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నవంబర్ 17, 18 తేదీ లో పర్యటిస్తారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.
అలాగే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు గనులు శాఖ మంత్రి  ప్రహల్లాద జోషి నవంబర్ 17న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తారు ఆయన నవంబర్ 18న మల్కాజ్‌గిరి  పార్లమెంట్ నియోజకవర్గం లోనూ పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి అందుతున్న విధానాన్ని ప్రజలను అడిగి తెలుసుకుంటారు. సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను వివిధ ప్రాంతాలలో తిరిగి తెలుసుకుంటారు. పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసి ఈ కేంద్ర మంత్రులు సమావేశం కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: