యుద్ధానికి మళ్లీ సిద్ధమవుతున్న అమరావతి రైతులు?
మహాపాదయాత్ర నిలిచిన స్థలం యజమానిపై పోలీసు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని... సీసీ పుటేజిని సైతం పోలీసులు మాయం చేశారని శివారెడ్డి ఆరోపించారు. వీరిపై ప్రైవేటు కేసు వేస్తామని శివారెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఆటకాలు కల్పించినా అరసవల్లి వరకు మహా పాద యాత్ర సాగడం ఖాయమని శివారెడ్డి చెప్పారు. రాజధానిని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ సుధాకర్ ఆరోపించారు.