శ్రీలంక: పారిపోయిన గొటబాయకు ప్రతిపక్షం షాక్?
శ్రీలంక నుంచి పారిపోయిన గొటబాయ మొదట మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ కి వెళ్లారు. అక్కడి నుంచి బ్యాంకాక్ కు చేరుకున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్లోనే ఓ హోటల్ లో గొటబాయి ఉంటున్నారు. గొటబాయ రాజపక్స ఒకవేళ శ్రీలంకకు తిరిగి వస్తే..ఆయనపై విచారణ జరగాల్సిందేనని విపక్షం పట్టుపడుతోంది. గొటబాయకు మాతృభూమికి తిరిగి వచ్చే హక్కు ఉందని.. కానీ ఆరోపణలపై ఆయన్ను విచారించాల్సిందేనని సమాగి జన బలవేగయ పార్టీ స్పష్టం చేసింది..