శ్రీలంక: పారిపోయిన గొటబాయకు ప్రతిపక్షం షాక్?

Chakravarthi Kalyan
దేశం నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు సొంత దేశంలోని ప్రతిపక్షం షాక్ ఇచ్చింది. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో గొటబాయి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన గొటబాయ .. ఈ వారం తిరిగి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యుడు ఒకరు మీడియాకు చెప్పారు.

శ్రీలంక నుంచి పారిపోయిన గొటబాయ మొదట మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి  సింగపూర్ కి వెళ్లారు. అక్కడి నుంచి బ్యాంకాక్ కు చేరుకున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్‌లోనే ఓ హోటల్ లో గొటబాయి ఉంటున్నారు. గొటబాయ రాజపక్స ఒకవేళ శ్రీలంకకు తిరిగి వస్తే..ఆయనపై విచారణ జరగాల్సిందేనని విపక్షం పట్టుపడుతోంది. గొటబాయకు మాతృభూమికి తిరిగి వచ్చే హక్కు ఉందని.. కానీ ఆరోపణలపై ఆయన్ను విచారించాల్సిందేనని సమాగి జన బలవేగయ పార్టీ స్పష్టం చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: