ఆ ఒక్క జీవోతో బాబు గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన జగన్?
కుప్పం తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానమంటున్న జగన్.. తాజాగా నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చారు. ఈ నిధులతో మురుగునీటి కాలువలు, తాగునీటి కోసం నూతనంగా బోర్లు, పైప్ లైన్లు, సిమెంట్ రోడ్లు వేస్తారు. అలాగే డ్రైనేజీ కాలువలు, అంగన్వాడీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, దళవాయి, కొత్తపల్లె చెరువు కట్ట వద్ద పార్కు అభివృద్ధి చేస్తారు. వీటితో పాటు చెరువు నుంచి పట్టణానికి నీటి సరఫరా కోసం పైప్లైన్ల ఏర్పాటుకు ఈ నిధులను ఉపయోగిస్తారు.