జోరు పెంచేసిన జగన్.. టీడీపీ ఎలా తట్టుకుంటుందో?
ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాలో సీఎం జగన్ రేపు పర్యటించనున్నారు. ఇక్కడ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ ప్రాజెక్టు చేపడుతోంది. ఈ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.