జగన్‌కు షాక్‌: టీడీపీలోకి డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులు?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్‌కు మరో షాక్‌ తగిలింది. ఏకంగా ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే టీడీపీలో చేరుతున్నామని ప్రకటించడం కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆడపడుచు పల్లవి రాజు తాను టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు. ఈ పల్లవిరాజు.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆడపడుచు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కుమార్తె. పల్లవిరాజు.. పుష్ప శ్రీవాణి భర్త, వైకాపా అరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పరీక్షిత్‌ రాజు చెల్లెలు కావడం విశేషం. పల్లవిరాజు పార్వతీపురంలో తన అనుచరులతో ముందుగా సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మీడియా సమావేశంలో ప్రకటించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ సర్కారు విఫలమైందని..అందుకే తాను టీడీపీలో చేరుతున్నానని ఆమె ప్రకటించారు. తన నియోజక వర్గం కురుపాంలో గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వాటి పరిష్కారం కోసం టీడీపీలో చేరుతున్నానని పల్లవిరాజు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: