ఇవాళ పోలవరానికి జగన్, షెకావత్..!

Chakravarthi Kalyan
ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌ వెళ్లనున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి షెకావత్‌..  సీఎం జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్వాసిత కాలనీలను కేంద్ర మంత్రి షెకావత్‌  సందర్శించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పర్యటించనున్నారు. ఇందుకూరు పునరావాస కాలనీలో జగన్‌, షెకావత్‌ పర్యటిస్తారు.

ఇందుకూరులో సీఎం, కేంద్రమంత్రి షెకావత్ నిర్వాసితులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీలో పర్యటించనున్నారు. తాడువాయిలో నిర్వాసితులతో జగన్‌, షెకావత్‌ మాట్లాడనున్నారు. మధ్యాహ్నం జగన్, షెకావత్.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం పోలవరం నుంచి జగన్, షెకావత్ విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణానికి సాయం చేయాలని జగన్ కేంద్రమంత్రిని కోరనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: