ఇవాళ పోలవరానికి జగన్, షెకావత్..!
ఇందుకూరులో సీఎం, కేంద్రమంత్రి షెకావత్ నిర్వాసితులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీలో పర్యటించనున్నారు. తాడువాయిలో నిర్వాసితులతో జగన్, షెకావత్ మాట్లాడనున్నారు. మధ్యాహ్నం జగన్, షెకావత్.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం పోలవరం నుంచి జగన్, షెకావత్ విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణానికి సాయం చేయాలని జగన్ కేంద్రమంత్రిని కోరనున్నారు.