డప్పు వాయించి ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా
ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోయినా కానీ ప్రజలతో కలిసి అందరికీ అందుబాటులో ఉంటున్నారు. త్వరలో మంత్రి పదవీ ఆశిస్తున్నారని, అందుకే ఆమె యాక్టివ్గా ఉంటున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఏకాంబరకుప్పంలో దళిత డప్పు కళాకారుల సాంస్కృతిక జిల్లా సమ్మేళనంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. కళాకాలుర సమక్షంలోకాసేపు డప్పు వాయించి రోజా అందరినీ ఆకట్టుకున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.