తెలుగుదేశం పార్టీలో మరో విషాదం నెలకొంది. విజయవాడ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. ఉన్నట్టుండి శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కార్డియాక్ అరెస్ట్తో శనివారం సాయంత్రం మృతి చెందాడు. విజయవాడ నగరంలో గత 25 ఏండ్లుగా టీడీపీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు.సామాజిక సేవ చేయడంలో కాట్రబాబు ముందుండేవారు. దశాబ్ద కాలం నుంచి పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. ముఖ్యంగా బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన నిత్యం అందుబాటులో ఉండేవారు. ఉన్నట్టుండి బాబు గుండెపోటుతో మరణించడంతో ఆయన మృతిపట్ల టీడీపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు.