బ్రేకింగ్: బండి పాదయాత్రపై కీలక నిర్ణయం..?

తెలంగాణాలో బీజేపీ ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు గానూ బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే బండి సంజయ్ పాదయాత్ర చేయడానికి కూడా రెడీ అయ్యారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్య లక్ష్మీ గుడి వద్ద నుంచి ఆయన పాదయాత్ర చేస్తారు. ఈ నేపధ్యంలో పాదయాత్రను విజయవంతం చేయడానికి గానూ 25 కమిటీలను  బీజేపీ ఏర్పాటు చేయనుంది.
కాసేపటి క్రితం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ నాయకత్వంలో  ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈటెల  రాజేందర్, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘనందనరావు తదితరులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నిక, బండి పాదయాత్ర, పార్టీ సంస్థాగత  అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగగా... పాదయాత్రపై సీనియర్ నేతల సహకారం తీసుకున్నారు. పాదయాత్ర కోసం కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: