బ్రేకింగ్: బండి పాదయాత్రపై కీలక నిర్ణయం..?
కాసేపటి క్రితం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ నాయకత్వంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘనందనరావు తదితరులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నిక, బండి పాదయాత్ర, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగగా... పాదయాత్రపై సీనియర్ నేతల సహకారం తీసుకున్నారు. పాదయాత్ర కోసం కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.