ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు ... ఎన్నిరోజులంటే ?
అమరావతి : ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు ప్రభుత్వం పొడిగించింది.అయితే కర్ఫ్యూ సమయాల్లో కొన్ని మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు ఉన్న సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించింది. అయితే పొడిగించిన సమయం ఈ నెల 10 వ తేదీ తరువాత నుంచి అమల్లోకి రానుంది.ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల వేళ్లల్లో కూడా మార్పులు జరిగాయి. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి.